24, అక్టోబర్ 2013, గురువారం

విజయనగర రాజులు బలిజ కులస్తులే అన్న 1901 మద్రాస్ సెన్సస్ రెపోర్ట్

            విజయనగర రాజులు బలిజ కులస్తులే అని  లో బ్రీటీషు వారు తమ మద్రాస్ సెన్సస్ రెపోర్ట్ లో 1901 లోనే రాశారు దానికి ఆధారాలు కూడా చూపెట్టారు. బలిజ కులం గురించి, బలిజకులస్తులము అనే చెప్పుకునే కులాలగురించి కూడా చెప్పారు. తమ కులం గురించి తామే మర్చిపోయిన అనేక విషయాలను ఎప్పుడొ ఇందులో పొందుపరిచారు. శెట్టిసమయం (శెట్టిసమ్మే) గురించి దానిలోని కులాల గురించి కూడా ఈ రెపొర్ట్ లో సంక్షిప్తంగా తెలిపారు. ఇన్ని ఆధారాలు చూపినా ఇంకా శ్రికృష్ణదేవరాయలు తమవాడే అని చెప్పుకోవడానికి కొన్ని కులాలు ఇంకా తాపత్రయ పడడం ఆశ్చ్యర్యం కలిగిస్తోంది. భారతదేశం గురించి ప్రపంచం లోని చాలా దేశాలకు తెలిసినంత కూడా భారతీయులకు తెలియదు. అంతగా చరిత్రను విజ్ఞానాన్ని నాశనం చేశారు. అది బయటి సంస్కృతుల పని  పని. దేశ సంస్కృతిని కాపాడి ఉన్నతమైన నాగరికతలను అభివృద్ధి చేసిన, భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచం నలుమూలలకు చేర్చిన ఒకే ఒక జాతి బలిజ జాతి. ఒక చేత రాజ్యపాలన మరోచేత వ్యాపారం, గ్రామాలలో న్యాయాధిపతులైన శెట్టి లేదా దేశాయి లు ప్రపంచ న్యాయశాస్త్ర సూత్రాలకు పునాదులు వేశారు. ఇంతగా తమ భూమిని ప్రేమించి, పాలించి, సంపదలను సృష్టించిన బలిజల చరిత్ర వారికే తెలియనంతగా భూస్థాపితం అయింది.  వాటిని తవ్వి తీసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నడుం కట్టారు. చాలామంది ఇప్పటికే వారి వారి పరిశోధనలను గ్రంధస్తం చేశారు. ఈ పుస్తకాలు త్వరలోనే ప్రజల ముందుకు రానున్నాయి. వారి వారి గ్రంధాలలోని కొన్ని భాగాలనే నేను ఈ బ్లాగ్ లొ పోస్ట్ చేస్తున్నాను. చరిత్ర పునర్నిర్మాణానికి అంకితమైన ఆ మహానుభావులందరికీ భగవంతుడు అయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 














                 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి