7, జూన్ 2020, ఆదివారం

బలిజ వారి ఉపనయనము, పెళ్ళి తతంగము, గోత్రాల వివరణ

     బలిజ కులస్తులకు ఉపనయనము ఎప్పుడు చేయాలి...పెళ్ళిలో చేయవలసిన తతంగాలు ఏవి? బలిజ కులస్తుల గోత్రములు, సూత్రము తదితర వివరాలను 120 సంవత్సరాల క్రితమే శ్రీ పగడాల నరసింహులు నాయుడు గారు గ్రందస్తం చేశారు...ఈ ఆచారాలను ఆనాడు కొందరు ఆచరిస్తే మరి కొందరు ఆచరించ లేక పోయేవారు...అందరికీ ఈ సమాచారం అందుబాటులో వుండాలని ఆయన బలిజవారు పురాణం అనే తమిళ గ్రంథం లో,బలిజ వంశ పురాణము అనే తెలుగు గ్రంథం లో ఆయన వివరంగా తెలిపారు..బలిజవంశ పురాణం లోని అంశాలు ఇవి. అందరూ తెలుసుకోవాల్సినవి....






5, జూన్ 2020, శుక్రవారం

114 సంవత్సరాల నాటి బలిజల ఇండ్లపేర్లు....

       విజయరంగ చొక్కనాథుడు (1704) మధుర రాజ్యాన్ని పాలించిన నాయక రాజు... రాజులు నిజానికి తమ కులం బహిరంగంగా చెప్పుకోవడానికి సంకోచించారు..అందుకే వారు కులం పేరు చెప్పుకోకుండా తమ తమ వంశాల పేర్లు మాత్రమే శాసనాలలో చెప్పుకున్నారు...మరి విజయరంగ చొక్కనాథుడికి ఎవరికీ లేనంత కులాభిమానం ఏమిటో అర్థం కాదు..శ్రీ రంగం లోని కోనేరు వద్ద గల శాసనం లో తమ బంధువుల ఇంటిపేర్లు అన్నీ రాయించాడు..వీరిలో 40 రాజకుటుంబాల కు సేవికా వృత్తి కానీ,వెండి ఆభరణాలు కానీ ధరించడం నిషేధం...ఎందుకంటే ఈ కుటుంబాలు సేవికా వృత్తి చేస్తే ఆయా వంశాల గౌరవం తగ్గుతుందని ఆనాటి వారు భావించేవారు..అదే విధంగా వెండి ఆభరణాలు అంటే కాళ్ళకు మెట్టెలు, కానీ కాళ్ళ గొలుసులు కానీ బంగారం తో చేసినవి మాత్రమే వాడాలి....
          అదే విధంగా మహా బంధువులు, గోష్టి బంధువులు, బహు బంధువులు అంటూ చాలా ఇండ్ల పేర్లు శాసనం లో చెక్కించారు...ఆ ఇండ్ల పేర్లు మీ కోసం ...120 సంవత్సరాల క్రితం అచ్చు వేయబడిన పగడాల నరసింహులు నాయుడు గారి "బలిజ వంశ పురాణం" కాపీలు...  
















1, జూన్ 2020, సోమవారం

114 సంవత్సరాల క్రితం నాటి బలిజవంశ పురాణం ...అప్పటి గురుపీఠాలు ...బలిజ కులస్తుల గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు

             120 సంవత్సరాల క్రితం బ్రిటీషువారు కులగణన కార్యక్రమం చేపట్టారు . ఆ సందర్భంగా బలిజ కులస్తులను శూద్రులుగా పరిగణించి నాలుగవ తరగతిలో చేర్చారు...దీనికి నాటి బలిజ సమాజం అభ్యంతరాలు వెలిబుచ్చింది...బలిజకులస్తులు చంద్రవంశ క్షత్రియులని వారిని నాలుగవతరగతిలో కాకుండా రెండవతరగతిలో చేర్చాలని డిమాండ్ చేసింది....దానికి సెన్సస్ కమిటీ ఆధారాలు చూపెట్టమని అడిగింది ...దానికి అనేక పురాణాధారాలు ...చారిత్రక ఆధారాలను నాటి బలిజ పెద్దలు వారికి చూపించారు....ఆ ఆధారాలను అనేకమంది బ్రాహ్మణ పండితులకు ...చరిత్రకారులకు ...గురుపీఠాల అధిపతులకు పంపించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నాక బలిజకులస్తులను చంద్రవంశ క్షత్రియులుగా అంగీకరిస్తూ తెల్లవారు రెండవ కేటగిరీలో చేర్చారు.. ఆ వివరాలను ఉటంకిస్తూ శ్రీ పగడాల నరసింహులు నాయుడు గారు "శ్రీ చంద్రవంశ క్షత్రియులైన, ఆంధ్రులు, గౌరవులు, అను బలిజవంశ పురాణం లేక నాయుడుగార్ల సంస్థాన చరిత్రము" అనే పుస్తాకాన్ని వెలువరించారు...దీనికంటే ముందు "బలిజవారు పురాణం" అనే పుస్తకాన్ని ఆయన రచించారు ఇది  సుమారు 500 పేజీల  లకు పైగా తమిళ భాషలో వున్నది. ఈ రెండు పుస్తకాలు ప్రస్తుతము ఇండియాలో లభించడం లేదు. కాపు చరిత్ర సంకలన సమితి సభ్యులు ...శ్రీ పోలిశెట్టి సత్తిరాయుడు గారు లండన్ లోని బ్రిటీషు మ్యూజియం నుండి వాటి కాపీలను తెప్పించారు...ఆ వివరాలు మీ కోసం... 









10, ఏప్రిల్ 2020, శుక్రవారం

పెమ్మసాని కుటుంబీకులకు శ్రీ కృష్ణదేవరాయలుకు ఎలాంటి సంబంధం లేదు

పెమ్మసాని కుటుంబీకులకు శ్రీ కృష్ణదేవరాయలుకు ఎలాంటి సంబంధం లేదు
స్పష్టం చేసిన పెమ్మసాని రాజా కుటుంబీకులు పెమ్మసాని పరంధామ్ గారు....
.      ఈ రోజు అనగా 10-4-2020 మధ్యాహ్నం 11-27 నిముషాలకు నాకు ఒక మెస్సెజీ వచ్చింది. నేను పెమ్మసాని పరంధామ్ మీతో మాట్లాడవచ్ఛా ...అని.  నేనే వారికి ఫోన్ చేశాను. ఆయన చాలా సౌమ్యంగా మాట్లాడారు. ఆయన నాతో మాట్లాడుతూ ఫేస్ బుక్ లో రాయల వివాదం గురించి చదివానండీ మీ బ్లాగు కూడా చూశాను అన్నారు. శ్రీకృష్ణదేవరాయల తల్లి దీపాల నాగమ్మ అని చెన్నై లోని రాతప్రతుల లైబ్రరీ నుండి సేకరించిన పత్రాలలో వుందన్నారు...ఈ దీపాల నాగమ్మ ప్రస్తావన మా పెమ్మసాని వారి రికార్డులలో ఎక్కడా లేదని వారు స్పష్టం చేశారు,శ్రీకృష్ణదేవరాయల కుటుంబానికి పెమ్మసాని వారి కుటుంబానికి ఎలాంటి బంధుత్వం లేదని ఆయన స్పష్టం చేశారు...అదేవిధంగా మధురను పాలించిన విశ్వనాథనాయకుని కుటుంబం తో కానే తంజావూరు రాజకుటుంబాలతో కానీ పెమ్మసాని వారికి బంధుత్వం లేదని తెలిపారు. శ్రీ ముత్తేవి రవీంధ్ర నాథ్ రాసిన శ్రీకృష్ణదేవరాయల వంశ మూలాలు అనే పుస్తకం విషయం లో తమకు ఎలాంటి ప్రమేయం లేదన్నారు. అదే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని తాము సమర్థించడం లేదని స్పష్టం చేశారు...  ఇక అదేవిధంగా తమిళనాడు కమ్మ సంఘం వారు కూడా తిరుమలై నాయకర్ చిత్రపటాన్ని   కమ్మ కుల సంఘం పోస్టర్ లలో  కమ్మకులస్తుడిగా చూపవద్దని సూచించానని ఆయన తెలిపారు....తాను కొటికం వారి కైఫీయాత్ తో పాటు చాలా మాన్యు స్క్రిప్ట్స్ పరిశీలించానని వారందరూ బలిజకులస్తులేనని అదే విషయాన్ని తమ కులస్తులకు చెప్పానని ఆయన తెలిపారు. శ్రీకృష్ణదేవరాయల కుల వివాదంలో కమ్మవారి తరపునుండి శ్రీ పెమ్మసాని పరంధాం గారు ముగింపునిచ్చారనే అనుకుంటున్నాను. అదేవిధంగా కొందరు ఉద్రేక స్వభావులు వికీపీడియాలో శ్రీకృష్ణదేవరాయల తల్లి నాగులాంబ  పెమ్మసాని వారి ఆడపడుచు అని పెట్టారు. అలాంటి వాటిని కూడా తొలగించమని శ్రీ పరంధామ్ గారిని సవినయంగా కోరుతున్నాను..
....   ప్రతి కులంలో మంచి వాళ్ళు వుంటారు, చెడ్డవాళ్ళూ వుంటారు...శ్రీ పెమ్మసాని పరంధామ్ గారు నాతో మాట్లాడిన తీరు వారిపై గౌరవాన్ని పెంచింది.... మీ వాదనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను...కమ్మ వారి పట్ల నాకు ఎలాంటి ద్వేష భావన లేదు...ఎవరో కొందరు ఫేక్ ఐడీ లతో వచ్చి నన్ను బూతులతో సత్కరించారు .... ఎవరో కొందరు వెధవలు చేసే పనులకు మనం కులాన్ని ధూషించకూడదు అన్నది నా అభిమతం ....నా రాతల వల్ల మిమ్మల్ని నొప్పించి వుంటే నన్ను మన్నించమని పెమ్మసాని పరంధామ్ గారిని కోరుతున్నాను......

                                                                                                              -ధూపం అభిమన్యుడు 

17, జులై 2017, సోమవారం

రాయల కుల వక్రీకరణలకు సమాధానం....1




బ్లాగు మిత్రులకు శుభాకాంక్షలు....
    దాదాపు సంవత్సరం కావొస్తుంది...కాస్త బిజీగా వుండడం వల్ల్ బ్లాగును అప్డేట్ చేయలేకపోయాను...క్షంతవ్యుడిని...
         ఈమధ్య బలిజ కులాన్ని టార్గెట్ చేయడం చాలామందికి ప్యాషనైపోయింది. అన్ని రకాల దోపిడీలు చేసి  లెక్కలేనంత సంపదను ఆర్జించిన కొన్ని కులాలు నేడు చరిత్ర కొరకు తెగ ప్రాకులాడుతున్నాయి. అత్యంత హేయమైన గత, వర్తమాన చరిత్రలు కలిగిన కులాలు తమ చరిత్రను గొప్పగా చూపించుకోవడానికి బలిజ కుల చరిత్రను కబ్జా చేయడానికి పూనుకున్నాయి...
        హైదరాబాదులో కనబడిన స్థలాన్నల్లా ఆక్రమించుకుని కబ్జాలలో ఆరితేరిన జాతులు...తెలంగాణా ప్రజల  ఆగ్రహాన్ని చవిచూశాయి...చివరికి రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడానికి కారణమయ్యాయి... ఇక నవ్యాంధ్రప్రదేశ్ లో నంటారా సరే సరి అవన్నీ లోకానికి తెలిసిన విషయాలే....
          అలా సంపాదించిన అక్రమ సంపాదనలతో చరిత్ర ను కబ్జా చేయడానికి పూనుకున్నాయి...ఈ క్రమం లో కొందరు నీతి-జాతి లేని పండితులను ప్రలోభపెట్టి బలిజలపైకి వుసి గొల్పుతున్నాయి...ముందే నీతి-జాతి లేదు అపై ప్రలోభం ఒకటి ఇక చూసుకోండి నాసామిరంగా...ఆ పండితులు వేసే కుప్పిగంతులు...
           ఇలాంటి వారు కొందరిని మేము గుర్తించాము....  
          చరిత్రపై కనీస పరిజ్ఞానం లేకుండా చరిత్రలు రాయడానికి వారు పూనుకుంటున్నారు. హిస్టరీ అంటే హిజ్ స్టోరీ అని అనుకుంటున్నరేమో....చరిత్రలో కట్టు కథలను ఇమిడ్చి లేని మసాలాలు పూసి వారు వండే చరిత్ర వంటకాలు చదువరులను ఆహా అనేట్లుగా వుంటున్నాయి. అబద్ధమాడినా అతుకేసినట్లుండాలనే సామెతను ఏమాత్రం విస్మరించకుండా...చరిత్ర పాకాన్ని వండేస్తున్నారు....

           అలాంటి వారిలో అగ్రగణ్యుడు శ్రీశ్రీశ్రీ ముత్తేవి రవీంద్ర నాథ్ గారు...
ఈయన వాణిజ్య పన్నుల శాఖలో పని చేసి పదవీ విరమణ చేశారు... బాగా సంపాదించారు...సుఖంగా జీవిస్తున్నారు ...శేషజీవితాన్ని రామా,కృష్ణా అనుకుని గడపకుండా ... కాలక్షేపంగా ఫేస్ బుక్ కు అంకితం చేశారు...మంచిది....కాలక్షేప జీవితం గడపకుండా కుల చరిత్రలకు తెర లేవదీశారు...
ఈ మధ్య అన్ని కులాలకు క్లెయిం చేసుకోవడానికి ఒకాయన దొరికాడు ఆయనే మన శ్రికృష్ణదేవరాయల వారు ఎలాంటి చరిత్ర లేని వారూ ఆయనను తమకులస్తుడని అనిక్లెయిం చేస్తారు ఆధారాలు అడిగితే తెల్లముఖం వేస్తారు...
       మన రవీంద్రనాథ్ ముత్తేవి గారు కూడా రాయలను కమ్మ కులస్తుడిని చేయడానికి పడ్డ తాపత్రయం చూస్తే అబ్బా భారీగానే ముట్టినట్లు అనిపించింది నాకు....
         ఈయన "శ్రీకృష్ణదేవరాయలు వంశమూలాలు" అని తన స్వంత పాండిత్యాన్ని చక్కగా ప్రదర్శించారు...
       నా చిన్నప్పుడు మా నాయనమ్మ కథలు చెప్పేది అద్భుతంగా...లాజిక్ గా అలోచిస్తే తాతగుండుకు అవ్వ మోకాలికి ముడిపెట్టినట్లు అస్సలు సంబంధం వుండదు...
        ముత్తేవి గారి "శ్రీకృష్ణదేవరాయలు వంశమూలాలు" చదివినప్పుడు కూడా నాకు మా నాయనమ్మే గుర్తుకు వచ్చిందనుకోండి...
        మొదట్లో తప్పు పంథాలో రాస్తుంటే నేను వాటిని సూచించి తప్పులు సరిదిద్దుకోమని చెప్పాను....వాటికి సంబంధించి ఆధారాలు కూడా ఇచ్చాను... కానీ శ్రీ ముత్తేవి గారు నా కామెంట్లు పెడచెవిన పెట్టడమే కాదు నేను చూపించిన ఆధారాలు సైతం డిలిట్ చేశారు....నా టైం లైన్ నా ఇష్టమొచ్చినట్లు రాసుకుంటాను మీరేమన్నా రాసుకోదలిస్తే మీ టైంలైన్ లో రాసుకోండి అని తన ఫ్రెండ్స్ లిస్ట్ లో నుండి నన్ను తొలగించారు...
ఛా పోనీలే... చెత్త ఏం రాసుకుంటే ఏం లే... అని నేను పట్టించుకోకుండా వదిలేశాను.
          చివరికి ఆయన రాయాలనుకున్నదంతా రాశారు...చివరలో ముగింపు కూడా  ముచ్చటగా ముగించారు....
ఆయన రాయల కులం కమ్మ అని చెప్పాలనుకుంటే ఆధారాలు చూపిస్తే బాగుండేది...అంతటితో ముగించి వుంటే బాగుండేది...  కానీ ముగింపులో  "నా వాదనను వ్యతిరేకించి రాయలు యాదవ కులస్తుదనో....బలిజ కులస్తుడనో రుజువు చేయాలని ప్రయత్నించిన వారు విఫలం కావడం మీరు గమనించారు" అంటు తన విజయ పత్రికను ప్రకటించారు...
        ఇక గండికోటను 230 సంవత్స్రాలపాటు అత్యంట వైభవంగా పాలించిన పెమ్మసాని కమ్మ ప్రభువుల వైభవాన్ని గురించి ఏనాడైనా కనీసం తెలుసుకునే ప్రయత్నమైనా చేశారా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు... తప్పులు ఎత్తి చూపించి తప్పులకు ఆధారాలు చూపించిన నన్ను మీ టైం లైన్ లోనికి రానివ్వకుండా చాటుమాటున రాసి విఫలమయ్యారు అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా ఆర్యా... 
          సరే మన మధ్య జరిగిన దానిని పక్కకు పెడదాం...పెమ్మసాని వారు 230 సంవత్సరాలు గండికోటను పరిపాలించారు అన్నారు....
            మీరు గండికోట దుర్గం కైఫీయత్ చదివారా ఆర్యా...పెమ్మసాని తిమ్మా నాయకుడు అనేవాడు ఆరవీటి వంశీకులైన నంద్యాల రాజుల ఉద్యోగి అన్న విషయం మీకు తెలియదా...తెలియకపోతే చదివి తెలుసుకోండి...
               గండికోటదుర్గం కైఫీయత్ పేజీ నెం.43. ఆయనను నియమించిన వాడు ఔకు నాయంకరుడైన నంద్యాల నల్ల తిమ్మరాజు. విజయనగర పతనానంతరం నవాబుల వద్ద అడుక్కుని గండికోటను పరిపాలించాడు...అనంతరం అదే నవాబుల ప్రతినిధి తరిమితే శాపనార్థాలు పెట్టుకుంటూ హనుమన గుత్తికి వెళ్ళిపోయాడు. పేజీ నెం.72. 
ఆర్యా ఈ చరిత్ర మాకు చాలా చక్కగా  తెలుసు...తెలియంది మీకే...
"శ్రీ మద్రాజాధిరాజు రాజ పరమేశ్వర శ్రీవీరప్రతాప శ్రీ సదాశివదేవ మహారాయలు విజయనగరము నందు వజ్ర సిం హాసనారూఢులయి పృధివీరాజ్యము చేయుచుండగాను గండికోటరాజ్యం గండికోట రాజ్యం నందెల రాజులకు అమర నాయంకరానకు ఇచ్చియుండిరి. వారి తట్టునుంచి కమ్మ జాతి అయిన పెమ్మసాని తిమ్మానాయుడు అనే ఆయన గండికోట రాజ్యానకు అధికార దక్షుడైయుండెను, పైన వ్రాసిన సదాశివరాయలున్ను, అమరానికి అనుభవించేవారున్నూ రెడ్డి కరణాలున్నూ జంబులమడుగు తాలూకాలో వేయించిన శిలా శాసనము యొక్క సారాంశము".  మరి ఈ శాసనములో పెమ్మసాని  తిమ్మానాయుడు రాజా...లేక రాజోద్యోగా? నంద్యాల రాజులే సామంతులు వారిక్రింద పని చేసేవాడు రాజెలా అవుతాడు ఆర్యా...
        ఇది సదా శివరాయల కాలం లో జరిగిన కథ మరి మరి శ్రీకృష్ణదేవరాయలుకు పెమ్మసాని తిమ్మానాయకుడికి సంబంధం ఎలా అంటగడతారు ఆర్యా...?
         ఈ శాసనం లో "కమ్మజాతి" అని సంభోధించారు కులానికి, జాతికి, తెగకు అర్థాలు వేరువేరు అవి తమరికి తెలుసనే అనుకుంటున్నాము. లేదు తెలియదు అంటే నేను వివరిస్తాను. నంద్యాల రాజులదగ్గర పనివాడు చక్రవర్తికి బంధువెలా అవుతాడండీ ఆ మాత్రం లాజిక్ తెలియదా తమరికి. కేవల 38 సంవత్సరాలు మాత్రమే పెమ్మసాని వారు గండికోటలో వున్నారు...అది కూడా సదాశివరాయల తరువాత...ఆ తరువాత అతి హేయంగా హనుమనగుత్తికి తరుమగొట్టబడ్డారు....
పెమ్మసాని వారి చరిత్ర ముందు మీరు తెలుసుకోండి...మాకు తరువాత సలహాలిద్దురు కానీ...
                                                      మళ్ళీ తరువాత పోస్ట్ లో కలుద్దాం....
                                                                                                                          -ధూపం అభిమన్యుడు.      



 

17, ఆగస్టు 2016, బుధవారం

మధురను పాలించిన విశ్వనాథ నాయకుడి కులము, ఇంటిపేరు ఏమిటొ చూడండి...ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి....

మధురను పాలించిన విశ్వనాథ నాయకుడి కులము, ఇంటిపేరు ఏమిటొ చూడండి...ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి....


మిత్రులారా మధురను పరిపాలించిన విశ్వనాథ నాయకుడి గురించి చాలామంది తమ ఇష్టమొచ్చినట్టు తమ కులస్తుడని రాసుకుంటున్నారు. వాస్తవాలు ప్రపంచం ముందుకు తీసుకు రావడానికి మావంతు ప్రయత్నం చేస్తున్నాము. మిత్రులు ఇకనైనా వాస్తవ చరిత్రలు రాసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొటికం వారి కైఫీయత్తు ఒరిజినల్ స్కాన్ డ్ కాపీని పెడుతున్నాను చూడండి.  దీనిలో విశ్వనాథ నాయకుడి కులము, ఇంటిపేరును ప్రస్తావించారు. భద్రతాంశాలను దృష్టిలో పెట్టుకుని కొటికం వారి కైఫీయత్ మొత్తాన్ని ఇక్కడ పెట్టలేక పోతున్నాను. ఈ కైఫీయత్ ను పోలిశెట్టి సత్తిరాయుడు గారు సేకరించారు.
సేకరణ : పోలిశెట్టి సత్తిరాయుడు, హైదరాబాదు.

19, మార్చి 2016, శనివారం

కమ్మ మిత్రులారా చూడండి మీ వారి చరిత్ర కబ్జాలు....



మధురను పరిపాలించిన విశ్వనాథ నాయకుడు అతడి తండ్రి నాగమనాయకుడు,కమ్మ కులస్తులా ....
      విశ్వనాథ నాయకుడి గురించిన వివరాలాన్నీ కొటికం కైఫీయత్ చాలా స్పష్టంగా చెబుతోంది కొటికం కైఫీయత్ లో "బలిజవర్ణ గరికపాటి" అని కులాన్ని ఇంటిపేరుతో సహా పేర్కొన్నారు. ఇక ఆయన వంశం లో విజయరంగ చొక్కనాథుడు శ్రీరంగం లోని రంగనాథ స్వామి దేవాలయం లోని కోనేరు వద్ద శాసనం వేయించాడు. అందులో తనది బలిజ కులం అని రాజబంధువులు, గోష్టి బంధువులు అంటూ 200 ఇంటిపేర్లను చెక్కించాడు.  ఆ శాసనం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే వుంది. ఇంత స్పష్టంగా చరిత్ర మనకు లభిస్తుంటే మరో కమ్మ మిత్రులు ముత్తేవి రవీంధ్రనాథ్ గారు ఏ ఆధారాలు చూపకుండా చరిత్రను వివరిస్తున్నారు. ఇందులో కూడా మధుర రాజుల చరిత్రను కబ్జా చేసుకుని తన కులానికి అన్వయించుకున్నారు. అయ్యా ముత్తేవి రవీంధ్ర నాథ్ గారూ ఇప్పటికైన మేలుకోండి. ప్రపంచం మనవైపు చూస్తోంది.
మరొక విషయం కరికాళ చోళుడు కూడా కమ్మ వారే అని వీరు నిర్ధారించారు సుమండీ ....                               
ఈ   పోస్ట్ పెట్టడానికి గల కారణం ముత్తేరవీంద్రనాథ్ గారి ఫేస్ బుక్ టైం లైన్ లోనే ఖండించాలని అనుకున్నాను కానీ వారి టైంలైన్ లో కామెంట్లకు అవకాశం లేకుండా సెట్ చేశారు కనుక తప్పని సరి పరిస్థితిలో ఈ బ్లాగులో ఖండిస్తున్నాను.  
దయచేసి ఇకనైనా చరిత్ర కబ్జా చేయడం మానుకుంటారని ఆసిస్తున్నాను.

 రవీంధ్రనాథ్ గారి ఫేస్ బుక్ లంకెను ఇక్కడ ఇస్తున్నాను గమనించండి.

        ,


https://www.facebook.com/ravindranath.muthevi/posts/973980656005999

29, జనవరి 2016, శుక్రవారం

ఇది చరిత్ర కబ్జా చేయడం కాదా...

ఇది చరిత్ర కబ్జా చేయడం కాదా....మధుర, తంజావూర్, జింజి లను పాలించిన నాయకరాజులు  బలిజ కులస్తులైతే వారిలో తిరుమల నాయకుడిని కమ్మవారు తమవాడు అని చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా....ఇది ఏమిటని అడిగితే ఆయన రాజు కాబట్టి వేసుకున్నాం అంటారు. రాజు అయితే రాజుగానే గౌరవించాలి. కానీ కులపత్రికలలో తామ కులానికి చెందిన గొప్పవారి సరసన తిరుమల నాయకుడి ఫొటోను వేసుకోవడం ఎంతవరకు సమంజసం. చరిత్రను ఇష్టమొచ్చినట్టు కబ్జా చేసేసి తమను మించిన వాడు ఈ లోకంలోనే లేడని గప్పాలు కొట్టుకోవడం ఏ పాటి సంస్కారమో చెప్పాలి. ఏమైనా అంటే అందరూ మాపై పడి పోతారు అంటూ బుగ్గలు నొక్కుకునే కమ్మ మిత్రులారా  చూడండి మీవారి నిర్వాకం. ఇప్పటికైనా చరిత్ర తెలుసుకోండి. చరిత్రను కలుషితం చేయకండి. చరిత్రను చరిత్ర లాగ వుండనివ్వండి. గొప్పల కోసం గప్పాలు కొట్టుకోకండి.
 దయ చేసి మా చరిత్రను మాకు మిగిలించండి.

11, జులై 2015, శనివారం

వెలివేయబడిన బ్రహ్మనాయుడి బంధువులే వెలమలు (నాయకురాలు నాగమ్మ-7)



        నాకు లభించిన అనేక ఆధారాలను బట్టి బ్రహ్మనాయుడి బంధువులే వెలమ కులస్తులని స్పష్టం చేస్తున్నాను. నేను స్పష్టం చేస్తున్న ఈ విషయం ఎవరినో కించపరచాలనో, నొప్పించాలనో చేస్తున్నది కాదు. చరిత్ర అనేక విధాలుగా వక్రీకరించబడింది. ఏ కులానికి సంబంధించి ఆ కులం ప్రత్యేకతలు చరిత్రలో ఎన్నో వున్నాయి. చరిత్రగతిని అర్థం చేసుకోవడం లో జరిగిన పొరపాట్లు, లేని చరిత్రను తమకు ఆపాదించుకున్న కొందరు రచయితలు అసలు చరిత్రను బయటకు రాకుండా చేశారని నా అభిప్రాయము. రెండువేల సంవత్సరాలకు పూర్వం నాలుగు వర్ణాలుగా, 27 కులాలుగా వున్న కులాలు 19 వ శతాబ్దం ఆరంభం నాటికి 66 అంతకంటె ఎక్కువ కులాలుగా విభజన చెందాయి. ప్రధాన కులం లో నుండి విభజింపబడ్డ కొంతమంది తరువాత కాలంలో ప్రత్యేక కులాలుగా ఏర్పడ్డ సందర్భాలు అనేకం. కొన్ని కులాలు వృత్తులాలో సహాయకారులుగా వుంటూ తరువాత ప్రత్యేక కులాలుగా విడిపోయిన సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. 

     అలా బలిజ లేదా కాపు కులం నుండి విడిపోయిన వారే వెలమ, కమ్మ కులాలు. వీరిలో వెలమలు పలనాటి చరిత్ర కాలం లో విడిపోగా, కమ్మ కులస్తులు కాకతీయ ప్రతపరుద్రుని కాలంలో విడిపోయినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. 

     నేటికీ ప్రకాశం జిల్లా లోని దోర్నాల మండలం లో వున్న బొమ్మలాపురం ప్రాంతం లో వెలమ కులస్తులు వున్నారు వీరిని ఈ ప్రాంతం లో పెద్ద కమ్మ వారని అంటారు. దీన్ని బట్టి వెలమలు కమ్మల కంటె ముందుగా విడిపోయిన వారని అర్థమవుతోంది. 

 పద్మనాయక చరిత్ర లోని ఈ క్రింది పద్యాలను ఒకసారి గమనించండి.

ఊరివరదనీరు నురికి సరస్సుజేరి
తీర్థయోగమైన తెరగుగాదె
కాలచోదితమున గాకతీశ్వరుల గొల్చి
కాపులెల్ల వెలమ కమ్మలైరి.

తొలికాలముర్వి గొడవల 
వెలియై యాలయములందు విహరించుటచే
నిలకాపు జనులు కొందరు 
వెలమలన్ జగతిలోన విశ్రుతులగుటన్ 

ఈ పద్యాలు కాపు కులం నుండి పై రెండు కులాలు విడిపోయినట్లుగా స్పష్టం చేస్తున్నాయి. 

    కమ్మ కులం గురించి మరో సందర్భం లో చర్చిద్దాం. ప్రస్తుతానికి పలనాటి యుద్ధ కాలం లో వున్నాం కాబట్టి సందర్భానుసారంగా వెలమ కులం ముందు నాటి పరిస్థితులు ఏంటో దాని పూర్వాపరాల గురించి విశ్లేషిద్దాం.

రెండవ పద్యం లో "తొలికాలముర్వి గొడవల" అంటె మొదట్లో జరిగిన భూతగాదాల వల్ల.

    వెలియై యాలయములందు విహరించుటచే అంటే వెలివేయబడి ఆలయాలందు తలదాచుకున్నారు. వారే తరువాతి కాలం లో వెలమలుగా పిలువబడ్డారు. ఒక కులాన్నే వెలివేయడం సాధ్య మౌతుందా??? సాధ్యం కాదు. 

    కానీ పెద్ద ఎత్తున వెలివేయబడ్డారు. బహుశా అవి కొన్ని కుటుంబాలై వుంటాయి. అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఏర్పడ్డాయి. 

    కమ్మలకంటే ముందుగానే వెలమలు వెలివేయబడి మరో కులంగా స్థిరపడ్డారు. అంటే కాకతీయుల కాలం కంటే ముందై వుండాలి. 

     వెలమ కులం లో ప్రసిద్ధి గాంచిన వారు వెలుగోటి రాజులు. వీరి గోత్రం "రేచెర్ల"  వీరు 11,12 శతాబ్దాలలో నేటి కర్నూలు జిల్లా "వెలుగోడు" లో స్థిరపడినట్లు కనిపిస్తొంది. ఆ కాలం నాటికి ఈ ప్రాంతం లో అనేక గ్రామాలు ఉన్నాయి. వీరు నివసించిన వెలుగోడు మొదట్లో వెలివాడ, వెలుగువాడ, వెలుగోడుగా రూపాంతరం చెదినట్లు తెలుస్తోంది. వీరు ఇక్కడ మట్టికోట కట్టుకుని విజయనగర రాజులకు సామంతులుగా రాజ్యమేలారు. నేటికీ విరు నిర్మిచిన చెన్నకేశవస్వామి దేవాలయం నాటి రాజులు వాడిన చలువబండ వెలుగోడులో వున్నాయి. ఆ తరువాత ముస్లిం పాలకుల దాడులలో వెలుగోడు మట్టి కోట ధ్వంసం కాగా వెంకటగిరి చేరినట్లు తెలుస్తోంది.

ఇక కథలోకి వద్దాం.....

      ప్రాచీన భారత దేశం లో శెట్టి సమయాలు అనే ఒక బృహత్తరమైన వ్యవస్థ వుండేది. వీరే అటు వ్యాపారాలను ఇటు గ్రామ, పట్టణ, నగర పాలనలను నిర్వహించారు. వీరినే దేశాయి రెడ్లు, దేశాయి శెట్లు అని పిలిచేవారు. ఈ దేశాయిలు, శెట్లు నాటి గ్రామాలలో పన్నులు వసూలు చేయడం, తీర్పులు చెప్పడం చేసేవారు. కులాల కట్టుబాట్లను నియంత్రించేది కూడా వీరే. నాటి ప్రజల లో కుడి, ఎడమ చేతులకు చెందిన కులాలు వుండేవి. వాటిలో కుడిచేతి కులాలే మొదటి నుండి ఆధిపత్యం చెలాయించాయి. ఈ కులాలకు చెందిన వారే నాటి రాజులు, చక్రవర్తులు. ఈ కుడి చేతి కులాలకు పెద్దలు బలిజ కులస్తులు.  

      నాగమ్మ తండ్రి రామిరెడ్డి జిట్టగామాల పాడులో తీర్పులు చెప్పడం లో దిట్ట అని పేరుప్రఖ్యాతులు గాంచాడు. అంటే ఆయన ఆ ప్రాంత దేశాయి రెడ్డి. దీన్ని బట్టి నాగమ్మ సామాన్య కుటుంబానికి చెందినది కాదు ఉన్నత కుటుంబానికి చెందినది అని తెలుస్తోంది. 

     భారత దేశాన్ని, ఇక్కడి సంపదను శాసించిన వారు వ్యాపారులు. పలనాటి చరిత్ర నాటికే పెద్ద ఎత్తున సముద్ర వ్యాపారాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతి రాజ్యం లో ప్రధాన ఆదాయ మార్గాలుగా వర్తక వాణిజ్యాలు వున్నాయి. ఈ వర్తక వాణిజ్యాలను శాసించిన వ్యాపారులు ఎవరు? 

    చరిత్రలో వర్తక వాణిజ్యాలను శాసించిన సమయాలు ప్రధానంగా వీరబలింజ సమయాలు. వీరిలో అయ్యావళీ-500, ముమ్మూరి దండులు-36 అనేవి శాసనాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. వీరంతా వర్తకులే కాదు గొప్ప యుద్ధ వీరులు కూడా. ఈ ముమ్మూరి దండులు వర్తక బిడారులను దొంగల నుండి రక్షించే రక్షకులు. 

ఇదీ నాటి నేపథ్యం...

     ఇలాంటి పరిస్థితులలో వర్తకులపై పెద్ద ఎత్తున దొంగల దాడులు జరుగుతుండేవి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత నాటి వీరబలింజలది. ఈ క్రమం లోనే వ్యాపారులు రాజుకు ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసి వుంటారు.  కానీ రాజు మంత్రి బ్రహ్మనాయుడికి బాధ్యతలు అప్పగించి వుంటాడు. ఆ దోపిడీ దారులంతా బ్రహ్మనాయుడి బంధువులు, స్నేహితులు కావడం తో వారిపై ఎలాంటి చర్యలూ తీసుకుని వుండరు. 

    విరబలింజ సమయాలకు ఒక అలవాటు వుంది. ఏ రాజైనా తమకు అనుకూలంగా చర్యలు తీసుకోక పోతే ఆ రాజ్యాలను సైతం ఆక్రమించుకుంటారు. తమ వారిని పాలకులుగా నియమిస్తారు. కానీ ఇక్కడ పాలకులు దొంగలూ అందరూ తమవారే ఏం చేయాలి? 

అందుకే జిట్టగామాలపాడు లో తండ్రి తరువాత ఆ బాధ్యతలను నిర్వహిస్తున్న నాగమ్మను ఆశ్రయించారు. 

అలా నాగమ్మ అనుగురాజు తనకు ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకుని బ్రహ్మనాయుడి భరతం పట్టింది. 

వాస్తవానికి నాగమ్మ ఒక్కతి కాదు ఆమె వెనుక ఉన్న సమయాలు ఆమెకు అండగా నిలిచాయి. 

      ఇక్కడ ఒక్క దొంగతనాలు మాత్రమే బ్రహ్మనాయుడిని మంత్రి పదవికి దూరం చేయలేదు. అది ఒక కారణం మాత్రమే. ప్రధానమైనది ఆయన ప్రతిపాదించిన చాపకూటి సిద్ధాంతం. ఈ చాపకూటి సిద్ధాంతం సహపంక్తి భోజనాలని చాలామంది రచయితలు అభిప్రాయపడ్డారు. కానీ అది తప్పు. చాపకూటి సిద్ధాంతం అనేది ఒక "ఎంగిలిమగళం" అని తెలుస్తోంది. ఒక చాపను పరచి అందులో  భోజనాన్ని కలిపుతారు. అక్కడ ఒకరు తిన్న తరువాత అదే చోట మరొకరు తింటారు. ఇక్కడ కులం లేదు కట్టుబాట్లు ఉండవు. ఇది చూసి చాలా మంది బ్రహ్మనాయుడిని గొప్ప సంఘ సంస్కర్తగా అభివర్ణిస్తారు. కానీ ఈ చాపకూడు వెనుక పచ్చి వ్యభిచారం జరిగేదని భార్యా భర్తల మధ్య ఉండే కట్టుబాట్లకు తిలోదకాలిచ్చేశారని తెలుస్తోంది. కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయింది. దీనికి అనుగుణంగానే మాచెర్ల, మార్కాపురం లలో ఉన్న చెన్నకేశవస్వామి దేవాలయ గాలి గోపురాలపై విపరీతమైన బూతు బొమ్మలను చెక్కించారని అంటారు. 

     కులసంకరాన్ని అతి పెద్ద నేరంగా భావించే పూర్వాచార కులాలకు బ్రహ్మనాయుడు పెద్ద సవాలుగా మారాడు. దీనిని పలువురు నాటి పెద్దలు నలగామరాజు దృష్టికి తీసుకు వచ్చి వుంటారు కానీ బ్రహ్మనాయుడికి ఎదురు చెప్పలేని అశక్తత నలగాముడు వెలిబుచ్చి వుంటాడు. దీనిని అడ్డగించలేని నలగాముడు నాగమ్మకు పరోక్షంగా సహకరించి వుండవచ్చు. చాపకూడును అడ్డగించలేక పోయినా, బ్రహ్మనాయుడిని నిలువరించడానికి దొగతనం నేరాలు అవకాశంగా చిక్కాయి. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సాక్ష్యాలతో సహా పట్టుబడడం తో బ్రహ్మనాయుడు తప్పించుకోలేని పరిస్తితులు ఏర్పడ్డాయి. 


    అలా దొరికిన బ్రహ్మనాయుడిని మొదట దేశబహిష్కారం శిక్షగా వేసి వుంటారు.  యుద్ధం లో ఓడిపోయిన తరువాత అయన వర్గీయుల పై కుల బహిష్కరణ వేటు వేసి వుండవచ్చు.

ఇంకా  ఉంది తరువాత టపాలో ...

24, మే 2015, ఆదివారం

నాయుళ్ళంటే బలిజ కులస్తులే...నాయుడు పదాన్ని ఇతరులు వాడకూడదు...


          నాయకుడు అనే పదానికి ఆధునిక రూపమే నాయుడు. నాయక అనే శబ్దం కులసూచకం. ఈ పదాన్ని గతం లో కేవలం నాయక కుటుంబాల వారు మాత్రమే వాడేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఇతర కులాల వారు కూడా ఈ శబ్దాన్ని తమ పేర్ల చివర తగిలించుకుంటున్నారు. నాయుడు అనేది బిరుదమని చాలామంది పొరపాటు పడుతున్నారు. అది పూర్తిగా తప్పు. 96 తెగలు కలిగి 56 రాజ్యాలు పరిపాలించిన వారు బలిజ కులస్తులు. ఈ 96 తెగల వారు సూర్య,చంద్ర,శేషనాగ,యదు వంశాలకు చెందిన వారు. ఈ 96 తెగల్లో "నాయక" అన్నది ఒకటి. ఈ విషయాన్ని అనేక ప్రాచీన గ్రంధాలలో ప్రస్తావించినప్పటికీ చాలామంది తమ పేరు చివరన నాయుడు అని తగిలించుకోవడం బహుశా వాస్తవం తెలియక అయి వుండవచ్చు. ఈ వాస్తవాలు అందరికీ తెలియాలని సంబంధిత సమాచారాన్ని ఇక్కడ పెడుతున్నాను గమనించగలరు. బాంబే గెజిటీర్ లో 96 తెగల సంచారం ఇచ్చారు. వాటిలో ఉన్న 'నాయక్' పదాన్ని గమనించండి.


1901 మద్రాస్ సెన్సస్ రిపోర్ట్ లో కూడా బలిజ బ్రాకేట్ లో నాయక్ అని వున్న విషయాన్ని గమనించండి. ఇదే పేరాలో  నాయక్ ఆర్ బలిజ కింగ్స్ అని వుండడం గమనించ గలరు.


కందుకూరి ప్రసాదిత్య భూపాలుడు రాసిన శ్రీ ఆంధ్ర విజ్ఞానము అనే గ్రంధం లో నాయక శబ్దం నాయుడుగా మారినదని తెలిపారు. ఈ గ్రంధం 1938 లో ప్రచురించబడింది. 
ఆయన తెలగ లేక నాయుడు అని సంభోధించారు.  
1381 వ పేజీ చివరలో, 1382 వ పేజీ మొదట్లో పెద్ద పెద్ద చదువులు చదివి యున్నతోద్యోగముల నొనర్చు వారు తెలగాలు నాయుళ్ళనిపించుకొనుచున్నారు. కానీ ఇటీవల నుద్యోగ గౌరవము నందుచున్న ప్రతి శూద్ర కులజుడును నాయుడు అని పిలువ బడుచున్నాడు. దీనిని చదువరులు గమనింతురు గాక అని హెచ్చరించాడు. 


దీనిని బట్టి నాయుడు అనే ఉపనామాన్ని బలిజ కులస్తులు మాత్రమే ఉపయోగించాలి. అది కులనామమే కానీ బిరుదం కాదని ఇతర కులాల వాళ్ళు తెలుసుకోవాలి. ఇలా నాయుడు అని ఉపనామాన్ని పెట్టుకున్న ఇతర కులాల వాళ్ళు ఇకనైనా దాన్ని తొలగించుకుంటారని ఆశిద్దాం. ఇప్పటికీ కోస్తా ప్రాంతం లో నాయుళ్ళు అని కేవలం బలిజ,కాపు లను మాత్రమే సంభోధిస్తారు. పాఠకులు గమనించ గలరు."నాయుడు" అనే ఉపనామం బలిజ కులాన్ని సూచిస్తుంది. ఇతర కులాల వాళ్ళూ దీన్ని తమ పేరు చివర తగిలించుకోవడం వల్ల వారు తమ కులాన్ని తప్పుగా చెప్పుకోవడం అనే భావించాల్సి వుంటుంది కనుక అలాంటి వారు సవరించుకుంటారని ఆశిస్తున్నాను.  

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

తెలగ కులనామమే ఇవిగో ఆధారాలు.....

    తెలగాలు అంటే ఎవరో తెలియదు కానీ వారి గురించి వ్యాఖ్యానించడానికి ఏ మాత్రం వెనుకాడరు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారా అంటే కనీసం అది కూడా చేయరు. చరిత్ర అంటే నిజంగా వీరికి చిన్న పిల్లలు ఆడుకునే ఆటగా కనిపిస్తున్నట్లుంది.

     బలిజ కులస్తులను నిరంతరం కించపరుస్తూ రాతలు రాయించే వారు ఒకరైతే రాసేవారు మరొకరు. రాయించే వారు బయటకు రావడం లేదు కానీ రాసే వారు మాత్రం మనకు కనిపిస్తున్నారు. అలాంటి వారిలో యద్దనపూడి వెంకటరత్నం యాదవ్  అనే రచయిత ఒకరు. ఈయన గతం లో యయాతి వంశీకుడు శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యాసాన్ని రాశారు. జులై 21,2010 లో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. దీంట్లో రాయలు బలిజ కులస్తుడు కాదని పాణి అనే రచయితను విమర్శిస్తూ రాశారు. 2014 సెప్టెంబర్ లో పి.వి.పరబ్రహ్మ శాస్త్రి గారిని విమర్శిస్తూ తెలింగ కులనామం కాదు అంటూ తెగ విమర్శించారు. 

    నాకెందుకో వెంకటరత్నం గారు బలిజ కులం పై వ్యతిరేకతతో రగిలి పోతున్నట్లు కనిపించింది ఆ రెండు వ్యాసాలలో. చరిత్ర గతించి పోయిన వాస్తవం. దాని పాదముద్రలే ఆధారాలు. గాడ్ బాసన్ ను కనుక్కోవడనికి శాస్త్రవేత్తలు బిగ్ బాంగ్ ప్రయోగాన్ని చేశారు. ప్రయోగానంతరం తాము గాడ్ బాసన్ ను కనుక్కున్నామని ప్రకటించారు. వారు దాన్ని చూశారా? లేదు సెకెన్ లో వందల వంతు కాలంలో జరిగి పోయే సంఘఠనను ఏ మానవ నేత్రం చూడలేదు. కానీ అది మిగిల్చిన గుర్తులను చూశారు అప్పుడే అవి గాడ్ బాసన్ పాద ముద్రలుగా భావించారు. అందులో కూడా కొంత అనుమానమే...

    చరిత్ర కొరకు ఇంతలేసి ప్రయోగాలు సాధ్యం కాదు. గతం లొ నిర్మించబడిన రాతల ఆధారాలే చరిత్రకు సాక్షాలు. మరి ఎలాంటి చారిత్రక సాక్షాలు చూడకుండా తెలగ అనేది కులనామం  కాదు అంటూ ఎలా ఖండించ గలుగుతారు? 

కందుకూరి ప్రసాద భూపాలుడు రాసిన శ్రీ ఆంధ్ర విజ్ఞానము అనే గ్రంధం లో 

   1938 లో ప్రచురితమైన వ్యాల్యూం నెం.2 లో గాజుల బలిజ గురించి, వ్యాల్యూం నెం.3 లో తెలగలు తెలుగు ప్రభువుల సీమలు,వ్యాలూం నె.6 లో కోటబలిజలు, లింగబలిజలు, విశ్వనాథనాయకుడు గురించి రాసిన సమాచారాన్ని ఇక్కడ యథతథంగా ఇస్తున్నాను గమనించండి. 









సేకరణ :- పోలిశెట్టి సత్తిరాయుడు, హైదరాబాదు.

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

పెరిక బలిజలు బలిజ కులానికి చెందినవారే....



     "పెరిక బలిజ" కులస్తులు బలిజ కులస్తులే.... ఈ విషయం తెలియని చాలామంది రెండూ వేరు వేరు కులాలుగా పరిగణిస్తూ వారి మధ్య ప్రఛ్చన్న స్పర్థలను రేకెత్తిస్తున్నారు. నేను గతంలో పెరికబలిజ అనే కులం బలిజ కులానికి ఉపకులము అంటూ ఒక పోస్ట్ ను పెట్టాను. తెలంగాణ ప్రాంతం నుండి ఒక పెరిక సోదరుడు అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. దాంతో వారి మనోభావాలను నొప్పించకూడదనే ఉద్దేశ్యంతో ఆ పోస్ట్ ను తొలగించాను. ఆ తరువాత చాలా గ్రంధాలను పరిశోధించిన తరువాత "పెరిక బలిజ", బలిజ కులానికి ఉపకులమే అని నిర్ధారించుకున్నాను. చరిత్ర తెలియని చాలామంది మిడి మిడి జ్ఞానంతో కేవలం తమకు మాత్రం బంధుత్వాలు లేవనే కారణంతో పెరిక బలిజ కులస్తులకు రిజర్వేషన్లు అందకుండా అడ్డు పడుతున్నారు. అలాంటి వ్యక్తులు అనాలోచితంగా ప్రభుత్వాధికారులకు ఫిర్యాదులు చేయడంతో రాయలసీమ ప్రాంతంలో అనేకమంది "పెరిక బలిజ" విద్యార్థులు కులధృవీకరణ పత్రాలు అందక ఫీజు రీఎంబర్స్ మెంట్ అందక కాలేజీ చదువులు మానుకున్న సంఘటనలు చాలా వున్నాయి. 

1970 వరకు అగ్రకులాలలో వున్న పెరిక బలిజలు 1970 తరువాత బి.సి-బి జాబితాలో చేర్చబడ్డారు. 

   తమ కుల సంఘాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు "పెరికె" "పెరికె(పురగిరి క్షత్రియ)" సంఘాలుగా మాత్రమే రాసుకుంటున్నారు. 

    ఇంకొందరైతే "కొన్ని పరిస్థితుల ప్రభావం వలన మన పెరికలు మారు వేషాలతో వ్యాపారం చేయవలసి వచ్చింది. అందుచే పెరిక బలిజలని వ్యవహరిస్తున్నారు" అంటూ సరికొత్త భాష్యాలను చెప్పి మరింత తప్పు దోవ పట్టిస్తున్నారు. 

   కులసంకరాలను అడ్డుకోవడం కులవ్యవస్థను పటిష్టంగా నడపడం బలిజల బాధ్యత ఎందుకంటే శెట్టి, దేశాయి, వ్యవస్థలకు నాయకులుగా సుమారు 2000 సంవత్సరాలు వ్యవహరించారు. 

    డబ్బు వున్నవాడు ఎక్కువ బలిజ అని, డబ్బులేని వాడు తక్కువ బలిజ అని వ్యవహరించీ వ్యవహరించీ లెక్కలేనన్ని ఉప కులాలుగా విడిపోయారు. ఈ ఉప కులాలు  కూడా వారు చేసే వృత్తి వల్ల ఏర్పడ్డాయని వీరంతా ఒకే జాతికి చెందిన వారని చాల గ్రంధాలలో రాసి పెట్టినప్పటికీ తెలుసుకోలేని అజ్ఞానంతో ఇంకా, ఇంకా దూరం అవుతూనే వున్నారు. 

     వీరబలిజ సమయాలు, శెట్టి సమయాలు అనేవి 18 ప్రధాన కులాల సమాహారాలు. వీరిలో చాలామంది బలిజ అని చివరన తగిలించుకుంటారు. అది వేరు.

పెరిక బలిజ కులస్తులు అలాంటి వారు కాదు. పెరిక బలిజ కులస్తులు ప్రధానంగా బలిజ కులానికి చెందిన వారే.  

బలిజ కులంలో శెట్టి బలిజ, తోటబలిజ లాగా వృత్తి ద్వారానే వీరు పెరిక బలిజలుగా పిలువబడ్డారు. 

రవాణ వ్యవస్థను శాసించిన జాతి ఇది. 

       ఒక యుద్ధం జరిగితే ఆ యుద్ధ సైనికుల అవసరాలు తీర్చే బాధ్యతలు వీరిపైన వుండేవి. ఎద్దులపైన, గాడిదల పైన జనప, గోగు నారలతో తయారైన గోనె సంచులతో రవాణాలు చేశారు. ఉప్పు తయారు చేయడం వల్ల ఉప్పు బలిజలుగా పిలువ బడ్డారు. స్వంత భూములలో  జనుము, గోగులు పండించి వటి నుండి నార తీసి గోనె పట్టలను మగ్గాలపై నేసే వారు. ఇలా నేత నేసే వారిని పీచు పెరికలని పిలిచే వారు. కాలక్రమేణా గొనె సంచుల తయారీ పరిశ్రమలు చేపట్టడంతో జనుము, గోగు పంటల అవసరం తగ్గిపోయింది. దీంతొ ఉపాధి లేని పెరికబలిజలు తప్పని సరి పరిస్థితులలో జనుము పండించే భూములను ఇతర పంటలకు మార్పు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

    "బలిజ కుల చరిత్ర" కంటే నారాయణ దేశాయి గారు 20 శతాబ్దం మొదట్లో రాసిన గ్రంధం. ఇందులో వివిధ పేర్లతో పిలువబడుతున్న బలిజ శాఖల పేర్లు ఇచ్చారు. గమనించండి.
ఇక రెండు 1901 మద్రాస్ ప్రెసిడెన్సీ సెన్సస్ రిపోర్ట్ లో బలిజ కులంలో గాజులు అమ్మే వారికి గాజుల అని, ఉప్పు అమ్మే వారిని పెరికె అని రాశారు గమనించాండి. 

ఇక మూడు 1886 లో అచ్చయిన కర్నూలు మాన్యువల్ లో బలిజ కులాల మధ్యన పెరిక బలిజ అని స్పష్టంగా పేర్కొన్నారు గమనించ గలరు.

ఇక నాలుగు 1968 లో అనంతరామన్ కమీషన్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో 1891 తమను ప్రత్యేక కులం గా గుర్తించాలని కోరినట్లు రాశారు. అంతే కాకుండా పెరిక కులం బలిజ, మరియు కవరై కులాలకు ఉపకులమని స్పష్టం చేశారు. అంతే కాకుండా అప్పటి జనాభా లెక్కల ప్రకారం చదువుకున్న వారి శాతం సంతృప్తి కరంగా లేదని రాశారు. వీరి అభివృద్ధికి ఏమేమి చర్యలు తీసుకోవాలో దిగువన సిఫారసు చేశారు. గమనించండి.
ఇక ఐదు... పెరిక కులం గురించి పరిశోధించి "చరిత్ర వాహినిలో పెరిక కులం" అని కానుగంటి మధుకర్ పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఏమని రాశారొ గమనించండి.